అనధికారికంగా విక్రయిస్తున్న నువ్వు విత్తనాలు సీజ్‌

ABN , First Publish Date - 2022-01-20T04:30:22+05:30 IST

కందుకూరు పట్టణంలోని నందావారివీధిలో లైసెన్సులేకుం డా నిల్వచేసి విక్రయాలు జరుపుతు న్న నువ్వుల ప్యాకెట్లను సీజ్‌ చేసినట్లు ఏవో అబ్ధుల్‌ రహీం తెలిపారు.

అనధికారికంగా విక్రయిస్తున్న నువ్వు విత్తనాలు సీజ్‌
తనిఖీలు నిర్వహిస్తున్న ఏవో రహీం

కందుకూరు, జ నవరి 19: పట్టణంలోని నందావారివీధిలో లైసెన్సులేకుం డా నిల్వచేసి విక్రయాలు జరుపుతు న్న నువ్వుల ప్యాకెట్లను సీజ్‌ చేసినట్లు ఏవో అబ్ధుల్‌ రహీం తెలిపారు. శిఖాకొల్లు రమాదేవి అనే మహిళ నువ్వుల ప్యాకెట్లను నిల్వచేసి ఉండగా ఆకస్మికంగా దాడిచేసి 14వేల రూపాయల విలువైన నువ్వుల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి చోట్ల విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తగు జాగ్రత్తలు తీపుకోవాలని, ఏ విత్తనం కొన్నా తగిన రశీదు, బిల్లు పొందితే నష్టం జరిగినా తగిన పరిహారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2022-01-20T04:30:22+05:30 IST