నకిలీ విత్తనాల పట్టివేత
ABN , First Publish Date - 2021-06-21T06:51:01+05:30 IST
మండల కేంద్రంలో అనుమతి లేని ఎరువు లు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఆది వారం టాస్క్పోర్స్ పోలీసులు సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారి రాథోడ్ గణేష్ తో కలిసి ఓంసీడ్స్ అండ్ ఫర్టిలై జర్ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఇంద్రవెల్లి, జూన్ 20: మండల కేంద్రంలో అనుమతి లేని ఎరువు లు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఆది వారం టాస్క్పోర్స్ పోలీసులు సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారి రాథోడ్ గణేష్ తో కలిసి ఓంసీడ్స్ అండ్ ఫర్టిలై జర్ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమతిలేని గ్రాన్యులేటెడ్ మిక్స్డ్ ఫర్టిలైజర్స్, అజయ్ 14:35:14 అనే పేరు గల 191 బ్యాగులు, అజయ్ 20:20:00 అనే పేరు గల 396 బస్తాల మొత్తం రూ.7లక్షల 44వేల 690 విలువైన 587 ఎరువుల బ్యాగులను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేసినట్లు వ్యవసాయాధికారి తెలిపారు. దుకాణ యజమాని దేవిసింగ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్పోర్స్ హెడ్ కానిస్టేబుల్ దారుట్ల శోభన్కుమార్, కానిస్టేబుళ్లు ఆడే మంగళ్సింగ్, ఎంఏ కరీం పాల్గొన్నారు.