23న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-01-21T05:26:14+05:30 IST

విశాఖ జిల్లా చోడ వరం మండలంలో ఈనెల 25 నుంచి 27వరకు 68వ రాష్ట్ర స్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పతివాడ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.

23న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

 గంటస్తంభం, జనవరి 20: విశాఖ జిల్లా చోడ వరం మండలంలో ఈనెల 25 నుంచి 27వరకు 68వ రాష్ట్ర స్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పతివాడ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ మేరకు  23న  నగరంలోని రాజీవ్‌ క్రీడా మైదానంలో జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన క్రీడా కారులు రావాలని సూచించారు. స్ర్తీలు 75 కిలోల బరువు,  పురుషులు 85 కిలోల బరువు ఉండాలన్నారు. షూస్‌ , ఆధార్‌ కార్డుతో హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరా లకు 80748 58972 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

 

Updated Date - 2021-01-21T05:26:14+05:30 IST