23న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
ABN , First Publish Date - 2021-01-21T05:26:14+05:30 IST
విశాఖ జిల్లా చోడ వరం మండలంలో ఈనెల 25 నుంచి 27వరకు 68వ రాష్ట్ర స్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పతివాడ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.
గంటస్తంభం, జనవరి 20: విశాఖ జిల్లా చోడ వరం మండలంలో ఈనెల 25 నుంచి 27వరకు 68వ రాష్ట్ర స్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పతివాడ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ మేరకు 23న నగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన క్రీడా కారులు రావాలని సూచించారు. స్ర్తీలు 75 కిలోల బరువు, పురుషులు 85 కిలోల బరువు ఉండాలన్నారు. షూస్ , ఆధార్ కార్డుతో హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరా లకు 80748 58972 నెంబర్ను సంప్రదించాలని కోరారు.