శారదాదేవి అలంకరణలో ఎల్లమ్మ తల్లి
ABN , First Publish Date - 2021-04-19T06:04:15+05:30 IST
వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మను శారదాదేవి అలంకరణలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు.
కనగల్, ఏప్రిల్ 18 : వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మను శారదాదేవి అలంకరణలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాం తాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భక్తిశద్ధ్రలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నాగపడిగలకు ప్రత్యేక పూజ లు చేశారు. శివుడి విగ్రహం వద్ద ప్రమిదలు వెలిగించి దీపారాధన చేశా రు. ఆయా కార్యక్రమాల్లో ఈవో ప్రభాకరసత్యమూర్తి సిబ్బంది చంద్రయ్య, లింగయ్య, నాగరాజు, ఉపేందర్రెడ్డి అర్చకులు మల్లాచారి, శ్రవణ్కుమారాచార్యులు, సుదర్శణాచార్యులు, ఫణి, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.