విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-01T05:45:47+05:30 IST
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కాటేపల్లిలో గ్రామంలో సోమవారం జరిగింది.
మోటకొండూరు, నవంబరు 30: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కాటేపల్లిలో గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కాటేపల్లి గ్రామానికి చెందిన యాస బాలరెడ్డి ఇంట్లో దుస్తులు ఉతికేందుకు చాడ గ్రామానికి చెందిన భూ దేవి శ్రీనివాస్ (42) వచ్చాడు. దుస్తులు ఉతికి ఇంటి భవనంపై ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు 12కేవి విద్యుత్ వైరు తగలడంతో విద్యుదాఘాతానికి గురై, భవనంపై నుంచి కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం భువనగిరికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.