‘నగరం’లో సాయంత్రం ఆరు వరకే షాపులు

ABN , First Publish Date - 2021-04-20T04:30:35+05:30 IST

కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 30 వరకూ జిల్లా కేంద్రంలోని వ్యాపార, వర్తక, వాణిజ్య సముదాయాలను ఉద యం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మాత్రమే తెరవ నున్నారు.

‘నగరం’లో సాయంత్రం ఆరు వరకే షాపులు

రింగురోడ్డు: కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 30 వరకూ జిల్లా కేంద్రంలోని వ్యాపార, వర్తక, వాణిజ్య సముదాయాలను ఉద యం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మాత్రమే తెరవ నున్నారు. ఈ మేరకు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయం తీసుకుంది. సోమవారం ప్రధానకార్యదర్శి కాపుగంటి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో విషయాన్ని వెల్లడించారు.  స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని... వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘా లతో చర్చించిన మీదట ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు మార్పును గమనించాలని కోరారు.

Updated Date - 2021-04-20T04:30:35+05:30 IST