అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2021-05-10T05:12:38+05:30 IST
ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపై తిరగవద్దని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఎస్పీ పర్యటించి కర్ఫ్యూ ఆంక్షల అమలు పరిస్థితిని పరిశీలించారు.
కడప(క్రైం), మే 9: ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపై తిరగవద్దని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఎస్పీ పర్యటించి కర్ఫ్యూ ఆంక్షల అమలు పరిస్థితిని పరిశీలించారు. ఏడురోడ్ల కూడలి, పాతబస్టాండు, కోటిరెడ్డిసర్కిల్, ఎర్రముక్కపల్లె ప్రాంతాల్లో తిరిగే వాహనదారులను ఆపి ఎక్కడికి వెళుతున్నారని ఆరా తీశారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మశీలను మినహాయించామన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట కడప వన్టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ ఉన్నారు.