ట్రంప్‌తో స్టెప్పులు వేయిస్తా: ప్రముఖ గాయకుడు

ABN , First Publish Date - 2020-02-22T21:11:30+05:30 IST

ప్రముఖ గాయకుడు ఖైలాశ్ ఖేర్ కూడా నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ విషయంపై ఆయన తాజాగా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ట్రంప్‌తో స్టెప్పులు వేయిస్తా: ప్రముఖ గాయకుడు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించేందుకు ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఇక ట్రంప్ పర్యటనలో నమస్తే ట్రంప్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇందుకోసం హౌడీ మోడీ ఈవెంట్‌ను మించి పోయే రీతిలో అహ్మదాబాద్‌ సర్దార్ పటేల్ స్టేడియంలో  ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు కూడా పాల్గొననున్నారు. ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ కూడా నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ విషయంపై ఆయన తాజాగా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘కుదిరితే నా పాటలకు ట్రంప్ చేత డ్యాన్స్ చేయిస్తా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 


కాగా.. అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 24న గుజరాత్‌లో ఈ పర్యటన ప్రారంభం కానుంది. తొలుత అహ్మదబాద్‌లో నిర్వహించే నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరవనున్న ట్రంప్ దంపతులు.. ఆ తరువాత ఆగ్రాకు, అటుపై ఢిల్లీకి పయనమవుతారు.


Updated Date - 2020-02-22T21:11:30+05:30 IST