ఫాంపాండ్‌లో పడి అక్కాతమ్ముడి మృతి

ABN , First Publish Date - 2021-03-02T05:58:44+05:30 IST

వ్యవసాయ పొలంలోని ఫాంపాండ్‌ (నీటి నిల్వ గుంత)లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మెదక్‌జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేట్‌లో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌడిపల్లి మండలంలోని రాజీపేట్‌ గ్రామానికి చెందిన రంగని భారతి ముగ్గురు కూతుళ్లలో చిన్న కూతురైన గంగమ్మకు నిఖిత(12), కార్తీక్‌(8) ఇద్దరు పిల్లలు.

ఫాంపాండ్‌లో పడి అక్కాతమ్ముడి మృతి
ఫాంపాండ్‌లో పడి మృతిచెందిన నిఖిత, కార్తిక్‌

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలంలో ఘటన


కౌడిపల్లి, మార్చి 1: వ్యవసాయ పొలంలోని ఫాంపాండ్‌ (నీటి నిల్వ గుంత)లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మెదక్‌జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేట్‌లో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌడిపల్లి మండలంలోని రాజీపేట్‌ గ్రామానికి చెందిన రంగని భారతి ముగ్గురు కూతుళ్లలో చిన్న కూతురైన గంగమ్మకు నిఖిత(12), కార్తీక్‌(8) ఇద్దరు పిల్లలు.  దాదాపు ఏడాదిన్నర క్రితం గంగమ్మ మృతి చెందడంతో భర్త శ్రీనివాస్‌ ఇద్దరు పిల్లలను రాజీపేట్‌లోని అమ్మమ్మ భారతి వద్దే ఉంచి వారి ఆలనా పాలనా చూస్తున్నాడు. సోమవారం సాయంత్రం పిల్లలు నిఖిత, కార్తీక్‌లతో పాటు మరో పిల్లవాడు గ్రామ సమీపంలోని పొలాల మధ్యన ఆడుకుంటుండగా నీటి నిల్వ కోసం తీసి ఫాంపాండ్‌లో ప్రమాదవశాత్తు అక్కాతమ్ముడు జారిపడి మునిగిపోయారు. వారితో పాటు ఉన్న మరో పిల్లవాడు గ్రామంలోకి పరిగెత్తుకువెళ్లి ఈ సమాచారాన్ని అందించాడు.  కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లగా, పొలంలోని ఫాంపాండ్‌లో అక్కాతమ్ముడి మృతదేహాలు కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. 


Updated Date - 2021-03-02T05:58:44+05:30 IST