ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-01-19T04:20:09+05:30 IST

ఆసిఫాబాద్‌ పట్టణంలో మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీనాయకులు ఆయన చిత్రప టానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళి
కాగజ్‌నగర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

ఆసిఫాబాద్‌, జనవరి 18: ఆసిఫాబాద్‌ పట్టణంలో మంగళవారం ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీనాయకులు ఆయన చిత్రప టానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో నాయకులు ఆత్మారాం, తాజ్‌బాబా, సాయిరాం, దౌలత్‌కుమార్‌, శ్రీనివాస్‌, రవి, శంకర్‌, మహేష్‌, ప్రవీణ్‌, బాబు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌: పట్టణంలో  టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కన్వీనర్‌ గుళ్లపల్లి ఆనంద్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.  కార్యక్రమంలో నాయకులు ఆత్మరాం, సురేష్‌ కుమార్‌, యలమంచలి శ్రీనివాస్‌, గుళ్లపల్లి లావణ్య, సౌభగ్య లక్ష్మి, శంకర్‌, ఎల్‌.మఽధుకర్‌, సంతోష్‌, మాధవి, దౌలత్‌రావు, గులాబ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:20:09+05:30 IST