ఏకాంతంగా ఆడికృత్తిక ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-08-02T05:23:13+05:30 IST

విజ్ఞానగిరిలో వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆడికృత్తిక ఉత్సవాలను సోమవారం ఏకాంతంగా నిర్వహించనున్నారు.

ఏకాంతంగా ఆడికృత్తిక ఉత్సవాలు
విద్యుద్దీపాలతో ముస్తాబైన ఆలయ ఆర్చి

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 1: శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని విజ్ఞానగిరిలో వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆడికృత్తిక ఉత్సవాలను సోమవారం ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఏటా శ్రీకాళహస్తీశ్వరాలయ అధ్వర్యంలో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే కరోనా ఉధ్రుతి దృష్ట్యా ఈ మారు ఏకాంతంగానే జరిపేందుకు ఆలయ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు.. విజ్ఞానగిరిపైకి భక్తులను అనుమతించడం లేదని ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మంగళవారం నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవాన్నీ ఏకాంతంగానే జరుపుతున్నట్లు గుర్తుచేశారు. 

Updated Date - 2021-08-02T05:23:13+05:30 IST