కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2020-08-05T10:44:56+05:30 IST

మున్సిపల్‌, గ్రామ పంచాయతీల్లోని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ..

కార్మికుల సమస్యలు పరిష్కరించండి

 గుజరాతీపేట: మున్సిపల్‌, గ్రామ పంచాయతీల్లోని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు డిమాండ్‌ చేశారు.  మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్మికులు నిర్వహించిన ఒక్కరోజు సమ్మె కార్యక్రమంలో గోవిందరావు పాల్గొని మాట్లాడారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, రక్షణ పరికరాలు, భద్రత సౌకర్యాలు కల్పించాలని, రూ 25వేల పారితోషికం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, కె.రాజు, పి.మాధవి,  స్వరాజ్యం, టి.చిట్టి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T10:44:56+05:30 IST