గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-28T03:18:49+05:30 IST

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఎంపీపీ గురవయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి
నేలపై కూర్చుని నిరసన తెలుపుతున్న మండల ఉపాధ్యక్షురాలు ఇంద్రాణి

మండల సమావేశంలో సభ్యుల డిమాండ్‌

గూడూరు, జనవరి 27: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఎంపీపీ గురవయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎంపీటీసీ సర్పంచులు, సర్పంచులు గ్రామాలలోని సమస్యలను ప్రస్తావించారు. తిప్పవరప్పాడు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కర్మాగారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కొంతమంది సభ్యులు డిమాండ్‌ చేశారు. తిప్పవరప్పాడు గ్రామంలో ఓసీకి చెందిన వ్యక్తి ఎస్సీ పేరిట రుణం పొంది ఇల్లు నిర్మించుకున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మండల ఉపాధ్య క్షురాలు ఇంద్రాణి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.  చర్యలు తీసుకుంటామని అధికారులు ఆమెకు సర్దిజెప్పారు. కార్యక్రమంలో తహసీల్దారు లీలారాణి, ఈవోపీఆర్డీ రవీంద్రబాబు, మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

=========================================================================

Updated Date - 2022-01-28T03:18:49+05:30 IST