స్వదేశానికి తిరిగొచ్చిన సోనియా, రాహుల్

ABN , First Publish Date - 2020-09-22T21:45:47+05:30 IST

హెల్త్ చెక్-అప్ కోసం అమెరికా వెళ్ళిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆమె తన తనయుడు రాహుల్ గాంధీతో

స్వదేశానికి తిరిగొచ్చిన సోనియా, రాహుల్

న్యూఢిల్లీ : హెల్త్ చెక్-అప్ కోసం అమెరికా వెళ్ళిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆమె తన తనయుడు రాహుల్ గాంధీతో కలిసి అమెరికా వెళ్ళారు. మంగళవారం ఇరువురు ఢిల్లీ వచ్చారు. 


సోనియా, రాహుల్ ఈ నెల 12న అమెరికా వెళ్ళారు. ఈ నెల 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అక్టోబరు 1 వరకు ఈ సమావేశాలు జరగవలసి ఉంది. అయితే ఎంపీలకు కోవిడ్-19 పాజిటివ్ వస్తుండటంతో సమావేశాలను కుదించే అవకాశం ఉందని చెప్తున్నారు. 


రాహుల్ గాంధీ సన్నిహితుడు ఒకరు మంగళవారం మాట్లాడుతూ, సోనియా, రాహుల్ మంగళవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగినట్లు తెలిపారు. 


కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిథి ఈ నెల 12న ఇచ్చిన ట్వీట్‌లో  సోనియా గాంధీ రొటీన్ హెల్త్ చెక్-అప్ కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఇప్పటి వరకు అమెరికా ప్రయాణం వాయిదా పడిందన్నారు. ఆమె క్షేమం కోసం శుభాకాంక్షలు తెలిపేవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2020-09-22T21:45:47+05:30 IST