స్వదేశానికి సోనియా, రాహుల్
ABN , First Publish Date - 2020-09-23T06:58:23+05:30 IST
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ విదేశాల నుంచి మంగళవారం భారత్కు తిరిగి వచ్చా రు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ విదేశాల నుంచి మంగళవారం భారత్కు తిరిగి వచ్చా రు. తన వైద్య పరీక్షల కోసం సోనియా ఈనెల 12న అమెరికాకు వెళ్లారు.
రాహుల్ కూడా ఆమెకు తోడుగా వెళ్లిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలకు ముందే సోనియా వైద్య పరీక్షలు జరగాల్సి ఉన్నా కొవిడ్ కారణంగా జాప్యం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి.