అనవసరంగా బయట తిరగొద్దు
ABN , First Publish Date - 2021-05-08T05:41:31+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్ననేపథ్యంలో ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి హెచ్చరించారు.
గుంటూరు, మే 7: కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్ననేపథ్యంలో ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కర్ఫ్యూ సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తిరుగుతున్న వాహన చోదకులను విచారించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటం ద్వారా తమను తాము కాపాడుకోవటంతోపాటు చుట్టుపక్కల వారిని కూడా కాపాడినట్లు అవుతుందన్నారు. అర్బన్లో ఒక్కరోజులోనే 157 వాహనాలు సీజ్ చేశామన్నారు.