కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-06-18T05:16:03+05:30 IST
జిల్లా పోలీస్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ అధికారులను ఆదేశించారు.
- ఎస్పీ రంజన్ రతన్కుమార్
గద్వాలక్రైం, జూన్ 17 : జిల్లా పోలీస్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ అధికారులను ఆదేశించారు. గద్వాల పట్టణంలోని పీజేపీ క్యాంప్లో నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయ భవన సముదాయం పనులను గురువారం ఆయన పరిశీలించారు. పూర్తి చేయాల్సిన పనుల వివరాలను హౌసింగ్ ఏఈ అనిల్శాస్త్రిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సాయుధ దళ కార్యాలయాన్ని, క్యాంప్ కార్యాలయాన్ని, క్యాంప్ రెసిడెన్సీని, పరేడ్ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నూతన భవన సముదాయం ఆవరణలో మొక్కలను నాటించాలని ఏఈని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, ఏఈ అనిల్శాస్త్రి, కాంట్రాక్టర్ ఓబుల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.