నేటి నుంచి వాడపల్లికి ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2021-03-06T05:58:12+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 5: కోనసీమలో ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం ఈ నెల 6 నుంచి ప్రతి శనివారం కాకినాడ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నామని మేనేజర్ పి.భాస్కరరావు తెలిపారు. తెల్లవారుజా
కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 5: కోనసీమలో ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం ఈ నెల 6 నుంచి ప్రతి శనివారం కాకినాడ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నామని మేనేజర్ పి.భాస్కరరావు తెలిపారు. తెల్లవారుజాము 3.45, 4.15, 5.15, 9.15, 9.45, 10.45 గంటలకు, మధ్యాహ్నం 2.45, 3.15, సాయంత్రం 4.15 గంటలకు బస్సులు వెళతాయన్నారు. వాడపల్లి నుంచి కాకినాడకు ఉదయం 6.30, 7.00, 8.00, మధ్యాహ్నం 12.00, 12.30, 1.30, సాయంత్రం 5.30, 6.00, 7.00 గంటలకు బస్సులు బయలదేరుతాయని తెలిపారు.