మొక్కల సంరక్షణకు ప్రత్యేక చొరవ చూపాలి
ABN , First Publish Date - 2021-06-22T05:43:41+05:30 IST
ఉపాధిహామీ కూలీలు ప్రస్తుత హరితహారంలో మొక్క లు నాటి వాటి సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో పీడీ చం దర్ నాయక్ సూచించారు.
డిచ్పల్లి, జూన్ 21: ఉపాధిహామీ కూలీలు ప్రస్తుత హరితహారంలో మొక్క లు నాటి వాటి సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో పీడీ చం దర్ నాయక్ సూచించారు. సోమవారం డిచ్పల్లి మండల కేంద్రంలో నడిపల్లి సచివాలయంలో ఉపాధి కూలీలు పంచాయతీ సిబ్బందితో ఆయన మాట్లాడా రు. మండలంలోని అన్ని గ్రామాల కార్యదర్శులు ఉపాధిహామీ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రత్యేక చొరవ చూపాలని ఆయన సూచించారు.