పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్ఙి
ABN , First Publish Date - 2021-10-24T05:21:41+05:30 IST
కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భీమిలి ఫస్ట్ అడిషినల్ సివిల్ జడ్జి జి.విజయలక్ష్మి పేర్కొన్నారు.
భీమిలి ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి జి.విజయలక్ష్మి
భీమునిపట్నం(రూరల్), అక్టోబరు 23: కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భీమిలి ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి జి.విజయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని చిప్పాడ దివీస్ కర్యాగారంలో శనివారం సాయంత్రం జరిగిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదాలకు ఎటువంటి పరిహారాలు అందుతాయన్న విషయాన్ని కూడా యాజమాన్యాలే కార్మికులకు తెలియజేయాలన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని అమలు చేసే బాధ్యతను యాజమాన్యాలు తీసుకోవాలని కోరారు. అందరికీ న్యాయం అందించాలంటే ముందుగా కార్మికులకు న్యాయ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దివీస్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఎన్.రావు, భీమిలి బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, న్యాయవాది సుధాకర్, లోక్ అదాలత్ సభ్యులు పి.సుందర్చంద్, పార్వతీశం, అడిషినల్ లేబర్ కమిషనర్ ఎంఎన్ వరహాలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.