కొవిడ్ మృతులకు..‘ఆత్మబంధు’ సేవలు
ABN , First Publish Date - 2020-09-26T09:15:55+05:30 IST
కొవిడ్తో మృతిచెందిన వారిని శ్మశనానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆత్మబంధు వాహన సేవలు
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), సెప్టెంబ రు 25: కొవిడ్తో మృతిచెందిన వారిని శ్మశనానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆత్మబంధు వాహన సేవలు అందుబాటులో ఉన్నాయని రెడ్క్రాస్ చైర్మన్ వైడీ రామారావు తెలిపారు. పీపీఈ కిట్ కలిగిన డ్రైవర్తో వాహనం నగర, పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. ఈ వాహనం కావాల్సినవారు నాగేంద్ర ఫోన్నెంబర్ 7702510397, 0884- 2371409లో సంప్రదించాలని ఆయన తెలిపారు.