క్రీడా ప్రాంగాణాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-06-03T05:34:54+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగాణాలను గ్రామాల్లోని యువత సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ అన్నారు.
- ఎమ్మెల్యే సతీష్కుమార్
సైదాపూర్, జూన్ 2: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగాణాలను గ్రామాల్లోని యువత సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ అన్నారు. సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో అన్ని రకాల వసతులను కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి, సర్పంచ్ చిట్టి ప్రత్యూష, ఎంపీటీసీ ఏరుకొండ ఇందిర-సుధీర్, మండల ప్రత్యేకాధికారి రాజమనోహర్రావు, ఎంపీడీవో ప్రేమ్సాగర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.