శ్రీనివాసం.. మురుగునీటి ఆవాసం
ABN , First Publish Date - 2021-10-22T06:37:36+05:30 IST
తిరుపతిలోని టీటీడీ అతిథి గృహమైన శ్రీనివాసం.. మురునీటికి ఆవాసంగా మారింది. వర్షం పడినప్పుడల్లా శ్రీనివాసం-మాధవం ప్రాంగణంలోకి మురుగునీరు వరదలా చేరుతోంది.
తిరుపతిలోని టీటీడీ అతిథి గృహమైన శ్రీనివాసం.. మురునీటికి ఆవాసంగా మారింది. వర్షం పడినప్పుడల్లా శ్రీనివాసం-మాధవం ప్రాంగణంలోకి మురుగునీరు వరదలా చేరుతోంది. ఈ కాంప్లెక్సులకు ఊశాన్యం భాగం పల్లంగా ఉండటంతో వర్షపు నీరు తూము ద్వారా కాలువలోకి ప్రవేశిస్తుంది. అయితే, కొంతకాలంగా తిరుమల బైపా్సరోడ్డుకు రెండువైపులా మరమ్మతులతో కాలువలు పూడిపోయాయి. ఉన్నకాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలు వర్షపునీటికి కొట్టుకు రావడంతో చిన్న కాలువలన్నీ పూడిపోయాయి. దీంతో గురువారెడ్డి సమాధి వద్ద కాలువ స్తంభించడంతో మురుగునీరు శ్రీనివాసం కాంప్లెక్స్ ఆవరణంలోకి చేరుతోంది. నెల రోజులుగా వర్షం కురిసినప్పుడల్లా రెండడుగుల మేర మురుగునీరు నిల్వ చేరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.
- తిరుపతి(కొర్లగుంట)