ట్రాన్స్‌కో సీఈగా శ్రీరాములు

ABN , First Publish Date - 2020-08-14T08:45:58+05:30 IST

ట్రాన్స్‌కో కడప జోన్‌ (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు) చీఫ్‌ ఇంజనీరుగా శ్రీరాములు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా

ట్రాన్స్‌కో సీఈగా శ్రీరాములు

కడప సిటీ, ఆగస్టు 13: ట్రాన్స్‌కో కడప జోన్‌ (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు) చీఫ్‌ ఇంజనీరుగా శ్రీరాములు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జోన్‌లో నిర్మిస్తున్న 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటలు కరెంటు ఇచ్చేందుకు నిర్వహణను బలోపేతం చేయనున్నామని చెప్పారు.


క్వారంటైన్‌ కేంద్రాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనను విద్యుత్‌ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీకే వీరభద్రయ్య, అధికారులు రవీంద్ర, రెడ్డిశేఖర్‌, ప్రసన్నలు అభినందించారు.

Updated Date - 2020-08-14T08:45:58+05:30 IST