తడిసిన మొక్కజొన్న ధాన్యం

ABN , First Publish Date - 2021-10-17T05:16:16+05:30 IST

నందికొట్కూరు పట్టణంలో శనివారం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. రైతులు మొక్కజొన్నలు కోసి పట్టణ సమీపంలో ఆరబెట్టుకున్నారు.

తడిసిన మొక్కజొన్న ధాన్యం

నందికొట్కూరు, అక్టోబరు 16: నందికొట్కూరు పట్టణంలో శనివారం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. రైతులు మొక్కజొన్నలు కోసి పట్టణ సమీపంలో ఆరబెట్టుకున్నారు. అయితే నీరు నిలవడంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది. తడిసిన మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలో తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించారు. సీపీఎం నాయకులు పక్కీర్‌ సాహెబ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T05:16:16+05:30 IST