వేములవాడకు చేరుకున్న రాష్ట్ర సహకార శాఖ కమిషనర్
ABN , First Publish Date - 2020-12-05T05:09:15+05:30 IST
రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలకుడు వీర బ్రహ్మయ్య శుక్రవారం వేములవాడుకు చేరుకున్నారు.
వేములవాడ, డిసెంబరు 4: రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలకుడు వీర బ్రహ్మయ్య శుక్రవారం వేములవాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావు రాజన్న ఆలయ అతిథిగృహం వద్ద స్వాగతం పలికారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆలయ అతిఽథిగృహంలో వీరబ్రహ్మయ్యను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సహకార శాఖ కమిషనర్ వీర బ్రహ్మయ్య శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ఓటరు నమోదు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.