అభివృద్ధిని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం: ఎంపీ

ABN , First Publish Date - 2021-04-12T06:00:22+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృ ద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో ఆదిలాబాద్‌ మండల బీజేపీ పార్టీ సమావేశం జరిగింది.

అభివృద్ధిని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం: ఎంపీ
పాయల శరత్‌కు పార్టీ కండువా కప్పుతున్న ఎంపీ సోయం

ఆదిలాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 11: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృ ద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో ఆదిలాబాద్‌ మండల బీజేపీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుతో నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలకు ఎంతో మంది బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. రానున్న ఆదిలా బాద్‌ జడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆదిలాబాద్‌ జడ్పీటీసీ ఉపఎన్నిక పార్టీ అభ్యర్థి పాయల శరత్‌ను ప్రకటించారు. ఇందులో జిల్లా నాయకులు వేణుగోపాల్‌, లోక ప్రవీన్‌రెడ్డి, లాలామున్నా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు.

Updated Date - 2021-04-12T06:00:22+05:30 IST