మూడు రాజధానుల పేరుతో రాష్ట్రం ముక్కలు

ABN , First Publish Date - 2021-01-21T06:15:13+05:30 IST

మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రం ముక్కలు
దీపాలు వెలిగించి నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు


అనకాపల్లి టౌన్‌, జనవరి 20: మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావంగా బుధవారం పరమేశ్వరి పార్కు జంక్షన్‌లో ప్రమిదలతో దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే భావంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదన్నారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరగలేదని, భూసేకరణ న్యాయపరంగా జరిగిందని న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మళ్ల సురేంద్ర, కొణతాల వెంకటరావు, కుప్పిలి జగన్మోహనరావు, మళ్ల గణేశ్‌, పి.త్రినాథ, పొలిమేర నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:15:13+05:30 IST