పారా ఏషియన్‌ గేమ్స్‌కు రాష్ట్ర క్రీడాకారులు

ABN , First Publish Date - 2022-01-29T06:17:47+05:30 IST

పారా ఏషియన్‌ గేమ్స్‌కు రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన పారా ఏషియన్‌ గేమ్స్‌ ట్రయిల్స్‌లో ఆర్‌.రవి, సిహెచ్‌.సరోజిని, రెడ్డి నారాయణ, కె.లలిత ప్రతిభ కనబరిచి ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.

పారా ఏషియన్‌ గేమ్స్‌కు రాష్ట్ర క్రీడాకారులు
ఎంపికైన క్రీడాకారులతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

అభినందించిన మంత్రి ముత్తంశెట్టి  

విశాఖపట్నం (స్పోర్ట్సు), జనవరి 28: పారా ఏషియన్‌ గేమ్స్‌కు రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన పారా ఏషియన్‌ గేమ్స్‌ ట్రయిల్స్‌లో ఆర్‌.రవి, సిహెచ్‌.సరోజిని, రెడ్డి నారాయణ, కె.లలిత ప్రతిభ కనబరిచి ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ పారా బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌లో వై.సత్తిబాబు, మహ్మద్‌ హుస్సేన్‌, మహిళల డబుల్స్‌లో వై.శశికళ, ఎం.లావణ్య కాంస్య పతకాలు సాధించారు.


మహిళల సింగిల్స్‌లో వై.శశికళ కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర క్రీడల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం తన కార్యాలయంలో పారా క్రీడాకారులను అభినందించి, వారికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ ఎన్‌.సూర్యారావు, పారా స్పోర్ట్సు రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, గణేష్‌, సోమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T06:17:47+05:30 IST