‘డీకే అరుణ నేతృత్వంలో పార్టీ బలోపేతం’
ABN , First Publish Date - 2020-09-29T06:18:08+05:30 IST
బీజేపీ జాతీ య ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేతృత్వంలో పార్టీ బలప డుతుందని రాష్ట్ర కోశాధికారి బి.శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు
భగీరథ కాలనీ/ జడ్చర్ల / దేవరకద్ర / భూత్పూర్ / నవాబ్పేట / మిడ్జిల్, సెప్టెంబరు 28: బీజేపీ జాతీ య ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేతృత్వంలో పార్టీ బలప డుతుందని రాష్ట్ర కోశాధికారి బి.శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ అన్నారు. డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సందర్భం గా సోమవారం హైదరాబాద్లో డీకే అరుణను కలిసి న నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛమిచ్చి అభినందన లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపా ధ్యక్షురాలుగా నియామకమైన డీకే అరుణకు జడ్చర్ల బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవా రం హైదరాబాద్లో ఆమె గృహంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రశేఖర్తో కలిసి పుష్పగుచ్ఛం అందజేశా రు. అలాగే డీకే అరుణను బీజేపీ రాష్ట్ర నాయకుడు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి సన్మానించారు. మాజీ మంత్రి డీకే అరుణను భూత్పూర్ మునిసిపాలిటీలోని అమిస్తాపూర్ పట్టణానికి చెందిన ఆ పార్టీ యువ నాయకుడు ఎండీ ఫారుక్ మరికొంత మంది యువ కులు సోమవారం హైదరాబాద్లో కలిశారు.
జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలి పారు. నవాబ్పేట మండల బీజేపీ నాయకులు సోమ వారం డీకే అరుణను, జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సం దర్భంగా డీకే అరుణ, జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ను సన్మానించారు. బీజేపీ జిల్లా నాయకుడు రాపోతుల శ్రీనివాస్గౌడ్తో కలిసి మిడ్జిల్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి పల్లె తిరుపతి, సింగల్విండో డైరెక్టర్ శ్రీధర్తో పాటు పలువురు నాయకులు డీకే అరుణకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆభినందనలు తెలిపారు.