భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-01T04:58:39+05:30 IST

భూ కబ్జాలకు పాల్పడేతే కఠిన చర్యలు తీసు కోవాలని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు.

భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ
ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ

విజయనగరం క్రైం:   భూ కబ్జాలకు పాల్పడేతే కఠిన చర్యలు తీసు కోవాలని  ఎస్పీ రాజకుమారి  ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 33 ఫిర్యాదులు స్వీకరించారు.  ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించి తీసుకున్న చర్యలను నివేదించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశిం చారు.  ఏఎస్పీ సత్యనారాయణరావు, సీఐలు వెంకటరావు, శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.  విధుల నిర్వహణలో నిజాయితీగా వ్యహరించిన పోలీసు సిబ్బందిని  జిల్లా పోలీసు కార్యాలయంలో  ఎస్పీ రాజకుమారి  అభినందించారు.  వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌, భోగాపురం మండలం పొలిపల్లిలో మహిళా సంరక్షణ పోలీసుగా పనిచేస్తున్న మద్దిల స్వాతికి ప్రోత్సాహక బహుమతి అందిం చారు.  డీఎస్పీ శేషాద్రి, సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. 

 


 


Updated Date - 2020-12-01T04:58:39+05:30 IST