నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
ABN , First Publish Date - 2022-01-24T05:16:35+05:30 IST
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ హెచ్చరించారు.
కడప(క్రైం), జనవరి 23 : నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి మాస్కు ధరించని 590 మందిపై రూ.88,530 జరిమానా విధించినట్లు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీసుశాఖకు సహకరించాలని, తమ సంరక్షణ, ఇతరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.