కంటెయిన్మెంట్ జోన్లలో పటిష్ట భద్రత
ABN , First Publish Date - 2020-07-02T09:35:24+05:30 IST
అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ కరోనా పంజా విసురుతోంది. దీంతో కంటెయిన్మెంట్ జోన్లలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా
డ్రోన్ కెమెరాలతో నిఘా
ప్రజలు బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరిక
నిబంధనలు అతిక్రమించిన 12 మందిపై కేసులు
అనకాపల్లి టౌన్/కొత్తూరు, జూలై 1: అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ కరోనా పంజా విసురుతోంది. దీంతో కంటెయిన్మెంట్ జోన్లలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన గవరపాలెంలోని దాసరిగెడ్డ రోడ్డు, సతకంపట్టు, దిబ్బవీధి, ముత్రాసువీధి తదితర ప్రాంతాలను కొవిడ్-19 డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సీఐ ఎల్.భాస్కరరావు బుధవారం పరిశీలించారు.
కంటెయిన్మెంట్ జోన్లలో ప్రజలు బయటకు రాకుండా డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా వారు చెప్పారు. దీనిపై ఆటోల్లో మైక్సెట్లు ఏర్పాటు చేసి ప్రచారం చేయిస్తున్నామన్నారు. కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన అనవసరంగా బయట తిరుగుతున్న 12 మందిపై కేసులు నమోదు చేశామని వారు చెప్పారు. పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా లేకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.