బదిలీ జాబితాలో అసంబద్ధాలు సవరించాలని వినతి
ABN , First Publish Date - 2020-12-04T06:04:07+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి విడుదల చేసిన సీనియార్టీ జాబితాలో అనేక లోపాలున్నాయని, వాటిని సవరించాలని ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రామచంద్రయ్య, పెదబాబు తెలిపారు.
గుంటూరు(విద్య), డిసెంబరు 3: ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి విడుదల చేసిన సీనియార్టీ జాబితాలో అనేక లోపాలున్నాయని, వాటిని సవరించాలని ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రామచంద్రయ్య, పెదబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు డీఈవో ఆర్ఎస్ గంగాభవానికి వినతిపత్రం అందజేశారు. బదిలీలకు దరఖాస్తు చేసుకున్న అనేక మంది పేర్లు జాబితాలో లేవన్నారు. అర్హత ఉన్నా పాయింట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, అర్హత లేని వారికి బదిలీల్లో అవకాశం కల్పించారన్నారు.