విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

ABN , First Publish Date - 2022-08-04T06:11:34+05:30 IST

విద్యార్థులు లక్ష్యంతో చద వాలని, ఉన్నత స్థాయికి ఎదిగాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే కోరా రు.

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
సిరిసిల్ల చంద్రంపేట పాఠశాలలో మొక్కలను నాటుతున్న ఎస్పీ

సిరిసిల్ల రూరల్‌, ఆగస్టు 3: విద్యార్థులు లక్ష్యంతో చద వాలని, ఉన్నత స్థాయికి ఎదిగాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే కోరా రు.  సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చంద్రంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం కరీంనగర్‌కు చెందిన వెంకట్‌ ఫౌండేషన్‌ అఽధ్వర్యంలో అందించిన నోట్‌బుక్‌లను, పాఠశాలకు ప్రోజక్టర్‌ను అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో చదువులో ధనిక, పేద తేడాలు ఉండవన్నారు. ప్రతీ విద్యార్ధి  కష్టపడి చదవాలని, ఉన్నత శిఖారాలను అధించాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే చేడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు.  వెంకట్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్వర్లు   నోట్‌బుక్‌లు, ప్రొజెక్టర్‌లను అందించడం అభినందనీయన్నారు.  అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలో వెంకట్‌ ఫౌండేషన్‌ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఎస్పీ మొక్కలను నాటారు.  సీఐ సర్వర్‌, వార్డు కౌన్సిలర్‌ పాతూరి రాజిరెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవేంద్ర, ఎస్‌ఎంసీ చైర్మన్‌ శ్రీధర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వెంకట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ గొడిశెల జితేందర్‌గౌడ్‌ బుధవారం రూ.10వేల విలు వైన నోటుపుస్తకాలు పంపిణీ చేశారు.  ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రమేష్‌, ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు వెంకట్‌, శంకర్‌గౌడ్‌, రాంమోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T06:11:34+05:30 IST