కరోనా బాధితుల ఆరోగ్యంపై ఎమ్మెల్యే వెలగపూడి ఆరా

ABN , First Publish Date - 2020-04-02T09:23:43+05:30 IST

ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిని ‘తూర్పు’ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పాడేరు సబ్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం సందర్శించారు.

కరోనా బాధితుల ఆరోగ్యంపై ఎమ్మెల్యే వెలగపూడి ఆరా

పెదవాల్తేరు: ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిని ‘తూర్పు’ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పాడేరు సబ్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ సోకిన వారి ఆరోగ్య పరిస్థితిపై వారు ఆరా తీశారు. అనంతరం వెలగపూడి మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసేందుకే ఆసుపత్రికి వచ్చానన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ విజయకుమార్‌, టీడీపీ నాయకుడు బైరెడ్డి పోతన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-02T09:23:43+05:30 IST