27న మహిళా గర్జనను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-10-24T05:18:55+05:30 IST

ఈ నెల 27న జరిగే మహిళాగర్జనలో ప్రతి కార్మికుడు కుటుంబంతో సహా పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు.

27న మహిళా గర్జనను విజయవంతం చేయండి
రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న డి.ఆదినారాయణ

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, అక్టోబరు 23: ఈ నెల 27న జరిగే మహిళాగర్జనలో ప్రతి కార్మికుడు కుటుంబంతో సహా పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు  254వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో సీఓఅండ్‌సీసీపీ  కార్మికులు పాల్గొన్నారు. ఈ దీక్షలలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని  అన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నవంబరు 1న యువతతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ దీక్షలలో పలువురు ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T05:18:55+05:30 IST