27న మహిళా గర్జనను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2021-10-24T05:18:55+05:30 IST
ఈ నెల 27న జరిగే మహిళాగర్జనలో ప్రతి కార్మికుడు కుటుంబంతో సహా పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, అక్టోబరు 23: ఈ నెల 27న జరిగే మహిళాగర్జనలో ప్రతి కార్మికుడు కుటుంబంతో సహా పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 254వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో సీఓఅండ్సీసీపీ కార్మికులు పాల్గొన్నారు. ఈ దీక్షలలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని అన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నవంబరు 1న యువతతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ దీక్షలలో పలువురు ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.