కుమారుడి సహా తల్లి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-10-18T06:20:17+05:30 IST
పుట్టు మూగ అయిన కుమారుడి సహా ఆత్మ హత్యాయత్నం చేసిన ఘటనలో కుమారుడు మృతిచెందగా, తల్లిని స్థానికులు కాపాడా
కుమారుడు మృతి, తల్లిని కాపాడిన స్థానికులు
నల్లగొండ జిల్లా హాలియాలో ఘటన
హాలియా, అక్టోబరు 17: పుట్టు మూగ అయిన కుమారుడి సహా ఆత్మ హత్యాయత్నం చేసిన ఘటనలో కుమారుడు మృతిచెందగా, తల్లిని స్థానికులు కాపాడారు. నల్లగొండ జిల్లా హాలియాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల ఎస్ఐ శివకుమార్ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి హేమలతకు నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటచిన్నలింగయ్యతో ఆరేళ్ల క్రితం వివాహంకాగా వీరు హైదరాబాద్లో నివాసం ఉంటు న్నారు. పెద్ద కుమారుడు విశాల్శివ(4) మూ గవాడు కావటంతో హైదరాబాద్లోని పలు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించారు. ఈ క్ర మంలో దసరా పండుగకు ముందు వారి స్వగ్రామమైన బంకాపురానికి వచ్చారు. ఆది వారం మధ్యాహ్నం హేమలత కుమారుడు విశాల్శివతో హాలియాలోని ఎడమ కాల్వ వద్దకు వెళ్లింది. భర్త, కుటుంబసభ్యుల ఫోన్ నెంబర్లు ఓ చిట్టీపై కుమారుడి సహా కాల్వ లోకి దూకింది. స్థానికులు గమనించి హేమ లతను రక్షించగా, బయటకుతీసేలోపే విశాల్ శివ మృతిచెందాడు. మృతుడి తండ్రి బొడ్డుపల్లి వెంకటచిన్నలింగయ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ శివకుమార్ తెలిపారు.