కరోనా భయంతో ఆత్యహత్య
ABN , First Publish Date - 2020-05-28T09:50:33+05:30 IST
కరోనా భయంతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం దండుబజార్ సమీపంలో
- రెండు రోజుల క్రితమే క్వారంటైన్ నుంచి ఇంటికి
మహారాణిపేట (విశాఖపట్నం), మే 27: కరోనా భయంతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం దండుబజార్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ, భయంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. చందకవీధికి చెందిన కారుకొండ మహేశ్ (41) కొవిడ్ అనుమానితుడిగా 14 రోజులు క్వారంటైన్ సెంటర్లో ఉండి, నెగెటివ్ రావడంతో రెండురోజుల క్రితమే ఇంటికి చేరుకున్నాడు. ఈ ప్రాంతంతో కేసులు అధికంగా ఉండడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలతో గాజువాకలో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటరిగా ఉంటున్న మహేశ్ ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.