కుటుంబకలహాలతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-02T05:40:54+05:30 IST

కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి పుంగనూరులో జరిగింది.

కుటుంబకలహాలతో యువకుడి ఆత్మహత్య
అష్రా్‌పఅలీ మృతదేహం

పుంగనూరు రూరల్‌, డిసెంబరు 1: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి పుంగనూరులో జరిగింది.  స్థానిక మేలుపట్లకు చెందిన అన్సర్‌బాషా కుమారుడు అష్రా్‌పఅలీ (26)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో  తరచూ గొడవపడుతుండేవారిని స్థానికులు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు అష్రా్‌పఅలీతో వేరు కాపురం పెట్టించినట్లు తెలిపారు. బుధవారం  రాత్రి అష్రా్‌పఅలీ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు ఆస్పత్రికి చేరుకుని  అష్రా్‌పఅలీ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Updated Date - 2021-12-02T05:40:54+05:30 IST