బావను చంపేందుకు సుపారి
ABN , First Publish Date - 2020-09-20T09:50:56+05:30 IST
అక్కను కాపురానికి తీసుకెళ్లడం లేదనే కోపంతో బావను చంపించాలనుకున్న కానిస్టేబుల్ కటకటాలపాలయ్యాడు...
కానిస్టేబుల్తోపాటు మరో ముగ్గురి అరెస్టు
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): అక్కను కాపురానికి తీసుకెళ్లడం లేదనే కోపంతో బావను చంపించాలనుకున్న కానిస్టేబుల్ కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ సర్కిల్ సులేమానగర్ ప్రాంతానికి చెందిన షౌకత్(28) రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి అక్క భర్త జాకీర్ఖాన్పై కుటుంబ తగాదాల నేపథ్యంలో 498 కేసు పెట్టింది. దీంతో జాకీర్ఖాన్ జైలుకెళ్లాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత జాకీర్ఖాన్ భార్యను తీసుకెళ్లకుండా వేరుగా ఉంటున్నాడు. ఇది సహించలేని కానిస్టేబుల్ షౌకత్ బావను ఎలాగైనా చంపాలని పథకం వేశాడు. హసన్నగర్ ఇంద్రానగర్కు చెందిన మేస్త్రీ పనిచేసే సయ్యద్ సాజిద్(37)కు రూ.5లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. సాజిద్ విషయాన్ని తన స్నేహితులైన ఇంద్రానగర్కు చెందిన ఆటో డ్రైవర్ అస్లామ్ఖాన్(22), కూలి పనిచేసే షఫీ(45)తో పాటు షేక్ అనే వ్యక్తులకు చెప్పాడు. వీరందరూ మద్యం తాగుతూ జాకీర్ఖాన్ను చంపాలని మాట్లాడుకుంటుండగా గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సయ్యద్ సాజిద్తో పాటు అస్లామ్ఖాన్, షఫీని అరెస్ట్ చేసి వివరాలు సేకరించగా నిజమేనని ఒప్పుకున్నారు. వారు చెప్పిన సమాచారం మేరకు కానిస్టేబుల్ షౌకత్ను కూడా శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. షేక్ పరారీలో ఉన్నాడు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.