కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-06-19T05:14:57+05:30 IST

కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్డీవో కిషోర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ... కరోనా కారణంగా పేద, దిగువ తరగతి కుటుంబాలకు ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోండి
ఆర్డీవో కిషోర్‌కు వినతిపత్రం అందిస్తున్న కూన రవికుమార్‌, టీడీపీ నాయకులు

 రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలి

 శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ 

శ్రీకాకుళం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్డీవో కిషోర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ... కరోనా కారణంగా పేద, దిగువ తరగతి కుటుంబాలకు ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బియ్యం కార్డు(తెల్లరేషన్‌) ఉన్న కుటుంబాల్లో ఎవరైనా కరోనాతో మృతి చెందితే రూ.10లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆక్సిజన్‌ కొరతతో జరిగిన మరణాలన్నిటికీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మృతుల దహన సంస్కారాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేలు అందరికీ అందడం లేదన్నారు. కరోనా దెబ్బకు వ్యవసాయ రంగం కుదేలైందని  తెలిపారు. రైతులను ఆదుకొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులకు బకాయిలను వెంటనే అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, చిట్టి మోహన్‌, బలగ నాగేశ్వరరావు, పీఎంజే బాబు, కిల్లి వేణుగోపాలస్వామి, ఎం.త్రినాథరావు, రమేష్‌, విజయరామ్‌, తిరుమలరావు, సుధాకర్‌, చౌదరి బాబ్జి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:14:57+05:30 IST