చిరు వ్యాపారులకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2020-11-26T06:29:14+05:30 IST
చిరు వ్యాపారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు.
ఎమ్మెల్యే అమర్
కొత్తూరు, నవంబరు 25: చిరు వ్యాపారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. పిసినికాడలో బుధవారం జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1128 మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.10 వేలు చొప్పున రూ.కోటి 12 లక్షల 80 వేలు చెక్కు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, నాయకులు మలసాల కిశోర్, దాడి రాము, దాడి ప్రసాద్, మళ్ల వెంకటరావు పాల్గొన్నారు.