సత్తిపండుకు సీజేఐ రమణ నుంచి అభినందన లేఖ
ABN , First Publish Date - 2021-10-22T05:56:47+05:30 IST
అద్దాలపై సూదితో బొమ్మలు వేసి ప్రముఖులకు బహుమతులు పంపే తాళ్ల వ్యాపారి గ్రంధి సత్యనారాయణ (సత్తిపండు)కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నుంచి అభినందన లేఖ వచ్చింది.
యానాం, అక్టోబరు 21: అద్దాలపై సూదితో బొమ్మలు వేసి ప్రముఖులకు బహుమతులు పంపే తాళ్ల వ్యాపారి గ్రంధి సత్యనారాయణ (సత్తిపండు)కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నుంచి అభినందన లేఖ వచ్చింది. ఒక పక్క న్యాయదేవత ఫొటో మరో పక్క ఎన్వి రమణ ఫొటోను అద్దంపై చిత్రించి పంపించారు. ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ సీజేఐ ఎన్వి రమణ నుంచి అభినందన లేఖ వచ్చిందని సత్తిపండు తెలిపారు.