వలస కార్మికుల తరలింపుపై మహారాష్ట్రకు సుప్రీం మందలింపు

ABN , First Publish Date - 2020-07-10T07:53:13+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలింపునకు తగిన చర్యలు తీసుకోని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. వలస కార్మికుల విషయంలో ఎలాంటి సమస్య లేదంటూ...

వలస కార్మికుల తరలింపుపై మహారాష్ట్రకు సుప్రీం మందలింపు

న్యూఢిల్లీ, జూలై 9: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలింపునకు తగిన చర్యలు తీసుకోని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. వలస కార్మికుల విషయంలో ఎలాంటి సమస్య లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వలస కార్మికుల తరలింపునకు తీసుకున్న చర్యలతో తాజా అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Updated Date - 2020-07-10T07:53:13+05:30 IST