21 నుంచి భూముల రీసర్వే

ABN , First Publish Date - 2020-12-04T05:21:19+05:30 IST

జిల్లాలో ఈ నెల 21 నుంచి భూ ముల రీసర్వే ప్రాజెక్టు మొదలవుతుందని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

21 నుంచి భూముల రీసర్వే

తొలిదశలో 228 గ్రామాలు..  

జేసీ (రెవెన్యూ) దినేష్‌కుమార్‌


గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 21 నుంచి  భూ ముల రీసర్వే ప్రాజెక్టు మొదలవుతుందని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. తొలిదశలో 228గ్రామాల్లో ఈ సర్వే జరుగుతుందన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి రీసర్వే అని చెప్పారు. దీనికి సం బంధించి ప్రీ సర్వే కార్యకలాపాలు ప్రారంభించామన్నారు. అడంగల్‌, ఆర్‌ఎస్‌ఆర్‌, 1బిలో ఉన్న డేటాని క్రోడీకరిస్తున్నామన్నారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్‌వోలతో బృందాలు ఏర్పాటు చేసి రికార్డుల స్వచ్ఛీకరణ చేయిస్తున్నామని చెప్పారు. సన్నా హక కార్యక్రమాలు పూర్తి చేసుకొని భూముల రీసర్వేకి సంసి ద్ధమౌతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్‌ని కూడా విడుదల చేసిందని తెలిపారు. 

Updated Date - 2020-12-04T05:21:19+05:30 IST