యరజర్ల భూముల కేసు వాయిదా
ABN , First Publish Date - 2020-07-07T10:39:49+05:30 IST
ఒంగోలు సమీపంలోని య రజర్ల ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు కేటాయించిన భూములపై హైకోర్టు సోమవారం ఎలాంటి
మరో పిటిషన్ దాఖలు చేసిన సర్వేరెడ్డిపాలెం రైతులు
ఒంగోలు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు సమీపంలోని య రజర్ల ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు కేటాయించిన భూములపై హైకోర్టు సోమవారం ఎలాంటి నిర్ణయం వెల్లడించ లేదు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు విన్న కోర్టు కేసును వాయిదా వేసింది. యరజర్ల వద్ద 21,560 మందికి నివేశన స్థలా లు ఇచ్చేందుకు ప్రభుత్వం 700 ఎకరాలను సేకరించిన విషయం విదితమే. దీనిపై కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మూ డు ఐరన్ ఓర్ కంపెనీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. సోమవారం విచారణ ప్రారంభించిన కోర్టు పిటిషనర్ల తరఫు న్యా యవాది వాదనలు వినింది.
ప్రభుత్వం నుంచి వాదనలు వినిపిం చాలని ఆదేశించింది. విచారణ ఈనెల 13కు వాయిదా వేసినట్లు తెలిసింది. కాగా, ఈ భూముల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయా నికి వ్యతిరేకంగా సర్వేరెడ్డిపాలెంనకు చెందిన కొందరు రైతులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. దాన్ని కూ డా హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15కు వాయిదా వేసినందున దీనిపై ఉత్కంఠకు తెరపడిం