వేరు కాపురం ఇష్టం లేక యువకుడి బలవన్మరణం

ABN , First Publish Date - 2021-04-21T06:12:15+05:30 IST

కన్నతల్లిని వదిలి వేరు కాపురం పెట్టడం ఇష్టం లేని తనయుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన పప్పుల ప్రసాద్‌.. స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు.

వేరు కాపురం ఇష్టం లేక యువకుడి బలవన్మరణం

చేర్యాల, ఏప్రిల్‌ 20 : కన్నతల్లిని వదిలి వేరు కాపురం పెట్టడం ఇష్టం లేని తనయుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన పప్పుల ప్రసాద్‌.. స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రవళిని కొన్నాళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుని తల్లి బాలలక్ష్మి వద్దే ఉంటున్నాడు. వేరుకాపురం పెట్టాలన్న భార్య సూచనతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తల్లిని విడిచి ఉండడం తనకు ఇష్టం లేదని భార్యతో తెగేసి చెప్పాడు. కొద్ది రోజుల క్రితం రవళి తండ్రికి యాక్సిడెంట్‌ కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంది. రోజులు గడుస్తున్నా కాపురానికి రాకపోవడంతో మనోవేదనకు గురైన ప్రసాద్‌ సోమవారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. సోమవారం ఉదయం గది నుంచి బయటకు రాకపోవడంతో తల్లి బాలలక్ష్మి  కిరాణా షాపు బందుచేసి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్‌ పోసుకుంటానని తల్లికి చెప్పి వెళ్లి, కొన్ని గంటల తరువాత తిరిగొచ్చాడు. తన గదిలోకి వెళ్లిన ప్రసాద్‌ మంగళవారం ఉదయమైనా బయటకు రాలేదు. కొడుకును నిద్ర లేపేందుకని తల్లి బాలలక్ష్మి గదిలోకి వెళ్లి చూసేసరికి నోట్లో నురగలతో చనిపోయి ఉన్నాడు. తల్లి బాలలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


Updated Date - 2021-04-21T06:12:15+05:30 IST