రోశయ్య శివైక్యం చెందడం కలచివేసింది: స్వరూపానందేంద్ర
ABN , First Publish Date - 2021-12-04T17:57:01+05:30 IST
మాజీ సీఎం రోశయ్య శివైక్యం చెందడం కలచివేసిందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: మాజీ సీఎం రోశయ్య శివైక్యం చెందడం కలచివేసిందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆధ్యాత్మికతకు రోశయ్య అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఆయన తపించారని తెలిపారు. రోశయ్య రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.