అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
ABN , First Publish Date - 2021-01-21T05:44:11+05:30 IST
విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించామని ఎన్నికల అధికారి బి హరిబాబు బుధవారం తెలిపారు.
- 27న విజయ డెయిరీ ఎన్నికలు
నంద్యాల, జనవరి 20: విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించామని ఎన్నికల అధికారి బి హరిబాబు బుధవారం తెలిపారు. నామినేషన్లను పరిశీలించామని, అన్నీ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారని తెలిపారు. డైరెక్టర్ల ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారని ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇండ్ల రమణారెడ్డికి అరటి పండు గుర్తు, గంగుల విజయసింహారెడ్డికి ఇటుక గుర్తు, యర్రలింగన్నగారి మల్లికార్జునకు గాజు గ్లాసు, యేలంపల్లి రంగారెడ్డికి దువ్వెన గుర్తు, ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, షీమా రవికాంత్ రెడ్డికి గాలిపటం గుర్తులను కేటాయించామని వెల్లడించారు.